ఒకప్పుడు టాప్ హీరోలందరితో కలిసి పని చేసి స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్స్తో దూసుకుపోతుంది. ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో సుచిత్ర పాత్ర పోషించి అందరిని ఆకట్టుకుంది. ఇక త్వరలో విడుదల కానున్న నారప్ప, విరాట పర్వం చిత్రాలలోను ప్రియమణి కనిపించి సందడి చేయనుంది.
నారప్ప జూలై 20న ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరైంది. ఇందులో అనేక విషయాలకు సంబంధించి ఆసక్తికర సమాధానాలు వెల్లడించింది. అసురన్ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించింది. కానీ ఈ రీమేక్లో ఆ పాత్రను ప్రియమణి పోషిస్తోంది. ఇది మీకు ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా, దానికి సమాధానం ఇచ్చిన ముద్దుగుమ్మ రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెట్టడం సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. నా వంతుగా నేను బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాను. పేరు వస్తే హ్యాపీ అని ప్రియమణి పేర్కొంది.
ఇక ఇటీవలి కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ల్లో ప్రియమణి తల్లి పాత్రలు పోషిస్తున్నారు. మరి నిజ జీవితంలో తల్లిగా ఎప్పుడు మారుతారు? అని మీడియా అడిగిన ప్రశ్నలు సంధించగా, దానికి కూల్గా సమాధానం ఇచ్చింది ప్రియమణి. నవ్వుతూ.. దానికి కొంచెం టైం పడుతుందని పేర్కొంది. ఈ అమ్మడు 2017లో ముస్తఫా రాజ్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.