బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు. అసలు అతను నిజంగా నేరస్థుడేనా? లేక పరిస్థితుల ప్రభావంతో అలా మారాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఐ, నోబడీ’ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
ఈ మలయాళ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. 9న మలయాళంలో రిలీజ్ అవుతున్నది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ సమపాళ్లలో కలబోసిన చిత్రమిదని, పృథ్వీరాజ్ నటన మరోస్థాయిలో ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. పార్వతి తిరువోతు, హాకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: నిస్సాం బషీర్.