ఇటీవల మలయాళంలో విడుదలైన ‘ప్రేమలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మలయాళ చిత్రసీమలో బిగ్గెస్ట్ రొమాంటిక్ హిట్గా నిలిచింది. తెలుగు వెర్షన్కు కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ తెలుగు వెర్షన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫీల్గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ‘ప్రేమలు’ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇక్కడి యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమాకు సీక్వెల్ను ప్రకటించారు. చిత్ర నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ ఈ విషయాన్ని తన సోషల్మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపింది. సీక్వెల్ను కూడా తెలుగులో తానే రిలీజ్ చేస్తానని ఎస్.ఎస్.కార్తీకేయ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు. నస్లేన్, మమితాబైజు జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు.