చందమామ కథలు సినిమాతో డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). ఆ తర్వాత రాజశేఖర్తో పీఎస్వీ గరుఢవేగ చిత్రాన్ని తెరకెక్కించి మంచి బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna)తో ది ఘోస్ట్ (The Ghost) సినిమా చేస్తున్నాడీ దర్శకుడు. ఈ యువ దర్శకుడు ఘోస్ట్ సినిమా విడుదల కాకముందే మరో ప్రాజెక్టు ప్రకటించి..టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. ప్రొడక్షన్ నంబర్ 2 (Praveen Sattaru)గా రాబోతున్న ఈ ప్రాజెక్టును ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు.
జీ5 ఒరిజినల్ (Praveen Sattaru)గా వస్తున్నఈ ప్రాజెక్టు వెబ్ మూవీనా లేదంటే సిరీస్ అనే దానిపై రాబోయే రోజుల్లో ప్రవీణ్ సత్తారు టీం నుంచి క్లారిటీ రానుంది. ఈ ప్రాజెక్టు ఏ జోనర్లో రాబోతుందనే మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా ప్రవీణ్ సత్తారు మరోవైపు వరుణ్ తేజ్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.
సోనాల్ చౌహాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భరత్-సౌరభ్ సినిమాటోగ్రాఫర్ కాగా..ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
Happy to be associating with @ipranathireddy of @thefilmrepublic for the biggest Original ever on @ZEE5Telugu 🙏👍👏 https://t.co/TMI2cqX8P4
— Praveen Sattaru (@PraveenSattaru) June 9, 2022