కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు తీరని విషాదంలో ఉన్నారు. ఆయన మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు పునీత్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు వాటిని కొనసాగించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆయన చదివిస్తున్న 1500 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు విశాల్.
ఇక తాజాగా ప్రణీత తన ఉదారతను చాటింది.దివంగత పునీత్ రాజ్కుమార్ గుర్తుగా ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ‘అప్పూ సర్.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులను భరించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని పేర్కొన్నారు.
బెంగళూరు నగరంలోని అంబేడ్కర్ భవన్లో నవంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ప్రణీత ఔదార్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, పునీత్ రాజ్కుమార్ గుండెపోటుతో అక్టోబరు 29న మరణించిన విషయం తెలిసిందే.