ప్రజాకవి కాళోజీ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూలవిరాట్, పద్మ, రాజ్కుమార్ , స్వప్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైనీ దర్శకుడు. విజయలక్ష్మి జైనీ నిర్మాత. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ఎస్.ఎస్.ఆత్రేయ స్వరపరిచిన ‘అలుపెరగని అవిశ్రాంత యోధుడా..’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటను ప్రముఖ నిర్మాత డి.సురేశ్బాబు విడుదల చేశారు. మహనీయుడు కాళోజీ జీవితాన్ని తెరకెక్కించిన దర్శక, నిర్మాతలిద్దరూ ధన్యులని, ఈ టీమ్ మొత్తానికి మంచి పేరు రావాలని, సినిమా ఘన విజయం సాధించాలని సురేశ్బాబు ఆకాంక్షించారు.
సినిమా చూసిన సెన్సార్ సభ్యులందరూ అద్భుతంగా ఉందని ప్రశంసించారని జైనీ ప్రభాకర్ చెప్పారు. పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు గీత రచయిత బిక్కి కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: స్వర్గీయ రవికుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ ఎం.వి.కె, నిర్మాణం జైనీ క్రియేషన్స్.