కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ భూతం’. ఎన్.రాఘవన్ దర్శకుడు. తమిళంలో రమేష్.పి.పిైళ్లె నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్స్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రభుదేవా పాత్ర పిల్లలతో పాటు అన్ని వర్గాలను అలరిస్తుంది. ఈ నెల 15న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. ప్రభుదేవా, రమ్య నంబిసన్, అశ్వత్, పరం గుహనేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్