యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సలార్, ఆదిపురుష్, రాధే శ్యామ్, ప్రాజెక్ట్ కె అనే బడా చిత్రాలు చేస్తున్నాడు. ఈ చిత్రాలు అన్నీ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నవే. ప్రభాస్ సినిమాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్గాను క్రేజ్ నెలకొని ఉంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ప్రభాస్ది. ఆయన చిన్న హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్లతోను కలిసిపోయి మాట్లాడుతుంటారు. ఇక సెట్కి ఒక్కోసారి వెరైటీ వంటకాలు తెచ్చి అందరి నోరు ఊరేలా చేస్తాడు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్ కోపం ప్రత్యేకమైన వంటలు చేయించాడు ప్రభాస్. తాజాగా సలార్ బ్యూటీ శృతి హాసన్ కోసం దాదాపు 20 రకాల వంటకాలను ప్రభాస్ స్పెషల్గా తీసుకొచ్చారట.
ప్రతీ ఒక్క వంటకం గురించి తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది శృతి. వాటిని చూసి చాలా థ్రిల్ అయింది. ఇన్ని రకాల వంటకాలను తన ముందు పెట్టినందుకు థ్యాంక్యూ అంటూ కామెంట్ రాసుకొచ్చింది. ప్రభాస్ తెచ్చిన వంటలలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు ఉన్నాయి. ప్రస్తుతం సలార్ షూటింగ్ చేస్తున్న ప్రభాస్ ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.