ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. కొద్ది నెలల క్రితం సింగరేణి ప్రాంతంలో ఓ షెడ్యూల్ పూర్తయింది. అయితే గత కొంతకాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం త్వరలో విశాఖపట్నం పోర్ట్లో కొత్త షెడ్యూల్ మొదలుపెడతారని తెలుస్తున్నది.
అక్కడ పదిహేను రోజుల పాటు ప్రభాస్ పాల్గొనగా కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ నెలలో ప్రభాస్ వరుస షూటింగ్స్తో బిజీగా ఉండబోతున్నారని..‘సలార్’తో పాటు ‘ప్రాజెక్ట్-కె’ చిత్రానికి సంబంధించిన షూట్లో కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ రెండు చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ సినిమాలో నటించబోతున్నారు. ‘సలార్’ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.