వరుస చిత్రాలతో తీరిక లేకుండా షూటింగ్స్లో పాల్గొంటున్నారు స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్తో ‘సలార్’, దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ సమాంతరంగా సాగుతున్నాయి. వీటితో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కూడా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రాల్లో నటిస్తున్న పని ఒత్తిడితో ప్రభాస్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న ఆయన పూర్తిగా కోలుకుని ‘సలార్’ చిత్రీకరణకు సిద్ధమయ్యారు. ఇలా హెక్టిక్ షెడ్యూల్స్ పెట్టుకోవడంపై గతంలో ప్రభాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ…‘నా కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేయాల్సిన సమయమిది.
నాకున్న ఇమేజ్కు అందరినీ సంతృప్తి పరిచే కథలు దొరకడం అరుదు. అలా దొరకనప్పుడు ఆలస్యమైనా వేచి చూశాను. కానీ ఇప్పుడు కొత్త తరహా కథలు వచ్చాయి. దాంతో వరుసగా చిత్రాలు చేస్తున్నా. ఏడాదికి 300 రోజులు పనిచేస్తున్నా. యాక్షన్ ఒక్కటే కాదు మెప్పించే భావోద్వేగాలు ఏవి ఉన్నా ఆ సినిమా విజయం సాధిస్తుంది. అభిరుచి గల ప్రేక్షకులే కష్టపడి పనిచేసే ఉత్సాహాన్ని ఇస్తుంటారు’ అని చెప్పారు. దర్శకుడు సందీప్ వంగాతో ‘స్పిరిట్’, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా ప్రభాస్ నటించబోతున్నారు.