ప్రభాస్ కథానాయకుడిగా యూరప్ నేపథ్య ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. 1970దశకం నాటి వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. శనివారం ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్ను విడుదల చేశారు. ‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ మనసు ఎప్పుడు వికలమవుతుందో తెలుసు. కానీ చెప్పను. నీ ఓటమి గురించి కూడా తెలుసు. అయినా చెప్పను. నీ చావు గురించి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే అవన్నీ మీ ఆలోచనలను అందవు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు…అదే సమయంలో మీలో ఒక్కడిని కూడా కాదు..’ అంటూ ప్రభాస్ సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. ఆయన లుక్స్ ైస్టెలిష్గా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ఖేడ్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్పరమహంస, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీద, సమర్పణ: యు.వి.కృష్ణంరాజు.