ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్బి అమితాబ్బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికాపడుకోన్ కథానాయిక. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ను నిర్ణయించారు. శనివారం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇందులో అమితాబ్బచ్చన్ పాల్గొంటున్నారు. అమితాబ్బచ్చన్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రభాస్ క్లాప్నిచ్చారు. ‘గురుపౌర్ణమి రోజున ఇండియన్ సినిమా గురు అమితాబ్బచ్చన్గారి మీద క్లాప్ కొట్టడం గౌరవంగా భావిస్తున్నా’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘ఈ సినిమా కోసం రామోజీఫిల్మ్ సిటీలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం. భారతీయ సినిమాలోని అత్యుత్తమ నటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్లో భాగమవుతున్నారు. భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది.