అగ్ర హీరో ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ పూర్తిచేసుకొని సంక్రాంతికి విడుదలకానుంది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ‘ప్రాజెక్ట్-కె’ షూటింగ్ జూలైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. కొద్దిరోజులు షూటింగ్ జరిపిన తర్వాత మరో షెడ్యూల్ కోసం బ్రేక్ తీసుకున్నారు. ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్మీదకు అడుగుపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటివారం నుంచి మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతారని తెలిసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు వ్యయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నారు.