కరోనా సమయంలో థియేటర్స్లో సినిమాలు రావడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మూవీ థియేటర్లోకి వచ్చి పెద్ద హిట్ కొట్టిందంటే గొప్ప విషయమనే చెప్పాలి. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత క్రాక్, ఉప్పెన చిత్రాలు థియేటర్లో విడుదలై మంచి విజయాలు సాధించాయి. సెకండ్ వేవ్ తర్వాత పలు సినిమాలు విడుదలైనప్పటికీ పెద్దగా విజయాలు సాధించలేదు. గోపిచంద్ సీటీమార్కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది.
కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించగా, శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తమన్నా, దిగంగన సూర్యవంశి హీరోయిన్స్గా నటించారు. తరుణ్ అరోరా మెయిన్ విలన్గా నటించగా, భూమిక హీరో సోదరి పాత్రలో నటించారు.
సీటీమార్ చిత్రానికి తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 3.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రానటువంటి భారీ వసూళ్లు సాధించడంతో నిర్మాతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గోపీచంద్ ఫ్రెండ్ ప్రభాస్.. తన సోషల్ మీడియాలో విజిల్ ఫొటో పోస్ట్ చేసి.. “నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కోవిడ్ సమయంలో మేకర్స్ ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేసి గొప్ప ప్రయత్నం చేసారని పేర్కోన్నాడు.