సంతోష్శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ప్రియ భవానీ శంకర్ కథానాయిక. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడు. యువీ కాన్సెప్ట్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 14న విడుదల కానుంది. ట్రైలర్ను గురువారం ప్రముఖ కథానాయిక అనుష్క శెట్టి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన చిత్రమిది.
ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇలా అన్ని భావోద్వేగాలను మేళవించి రూపొందించిన సినిమా ఇది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, సహ నిర్మాత: అజయ్ కుమార్ రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నరసింహా రాజు.