Pooja Hegde | టాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ, తన కెరీర్ బిగినింగ్లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోతో ఉండటంతో చాలా ఆనందంగా ఒప్పుకున్నానని చెప్పింది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పూజ వెల్లడించింది.
“ఆ సినిమా షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే ఆ హీరో నా క్యారవాన్లోకి వచ్చాడు. అప్పటికే అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ క్షణంలో నాకు ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా షాక్కు గురయ్యాను” అని పూజ చెప్పింది. ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయిన తాను సహనం కోల్పోయానని, వెంటనే అతడిని లాగిపెట్టి కొట్టానని పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. “అలా చేయగానే అతడు వెంటనే క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడితో కలిసి నటించాలనే ఆసక్తి నాకు పూర్తిగా పోయింది. అందుకే నా సీన్స్ను డూప్తో షూట్ చేశారు” అని ఆమె వివరించింది.
అయితే ఈ ఘటనలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన హీరో ఎవరో మాత్రం పూజ హెగ్డే వెల్లడించలేదు. పేరు చెప్పకుండా వదిలేయడంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. మహిళా నటులు ఇండస్ట్రీలో ఎదుర్కొనే ఇబ్బందులపై మరోసారి ఈ వ్యాఖ్యలు చర్చను రేపాయి. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, పూజ హెగ్డే ప్రస్తుతం దళపతి విజయ్తో కలిసి ‘జన నాయగన్’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఇది విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండగా, సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా, పూజ హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవం అంశాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.