Actress Pooja Hegde | మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. అయితే అదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. గత రెండేళ్లుగా పూజా సినీ కెరీర్ చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తర్వాత పూజా నటించిన 6 సినిమాలు పెవీలియన్ బాట పట్టాయి. సౌత్లో ఫ్లాపులు పలకరిస్తున్నాయని నార్త్కు వెళ్తే.. నార్త్లో కూడా ఇదే పరిస్థితి.
గంపెడంతో ఆశలు పెట్టుకున్న ‘సర్కస్’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ఘోరంగా ఫ్లాప్ అయింది.ఇక ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సైతం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నా పూజాకు మాత్రం అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు గుంటూరు కారంతో పాటు.. షాహిద్ కపూర్ ‘కోయి షక్’లో హీరోయిన్ గా నటిస్తుంది.. కాగా తాజాగా ఈ బ్యూటికి తెలుగు లో ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, పరుశురాం పెట్ల కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపికయిందని టాక్. అంతేకాకుండా విజయ్ దేవరకొండనే స్వయంగా ఆమె పేరును కన్సిడర్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.