మంగళూరు సోయగం పూజాహెగ్డే వరుసగా భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. వివిధ నగరాలలో షూటింగ్స్ జరుగుతుండటం, నిర్విరామ ప్రయాణాలతో ఈ భామ తీవ్రంగా అలసిపోతున్నదట. కాస్త విరామం కోసం ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం పూజాహెగ్డే.. సల్మాన్ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దివాళి’, రణ్వీర్సింగ్తో కలిసి ‘సర్కస్’ చిత్రాల్లో నటిస్తున్నది.
తెలుగులో త్రివిక్రమ్-మహేష్బాబు కాంబినేషన్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా చిత్రం ‘జనగణ మన’లో ఈ అమ్మడు నాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.నిర్మాణంలో ఉన్నవన్నీ ప్రతిష్టాత్మకమైన చిత్రాలే కావడంతో పూజాహెగ్డే విరామం లేకుండా ప్రయాణాలు సాగిస్తున్నది ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘ పూజాహెగ్డే నటిస్తున్న చిత్రాలన్నీ భారీ తారాగణంతో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు కమర్షియల్ యాడ్స్లో నటించాలని చాలా అవకాశాలొస్తున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా వృత్తిపట్ల అంకితభావంతో పనిచేయడం గ్రేట్’ అని పూజాహెగ్డే టీమ్ తెలిపింది.