Pooja Hegde | టాలీవుడ్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde).. తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. గురువారం ఉదయం శ్రీ కాళహస్తికి వెళ్లిన పూజా రాహుకేతు పూజలో పాల్గొంది. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంది. దర్శన అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేష వస్త్రంతో పూజాను సత్కరించి, వేద ఆశీర్వచనాలతో.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే.. పూజా ప్రస్తుతం దళపతి విజయ్తో జననాయగన్ సినిమాలో నటించడంతో పాటు సూర్య హీరోగా వస్తున్న రెట్రో చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
Heroine Pooja Hegde participated in Rahu Ketu Pooja at Sri kalahasti Temple pic.twitter.com/mcGwyVoXiR
— Gorati Naresh (@NareshWriting) April 3, 2025