ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో పాటు రాధే శ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా పూజా వివాదాస్పద విషయాలతో వార్తలలోకి ఎక్కుతుంది.
ఆ మధ్య సెల్వమణి .. పూజా హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన సపోర్టింగ్ స్టాఫ్ చాలా మందిని తీసుకొచ్చి నిర్మాతలను ఇబ్బందికి గురి చేస్తుందని వాపోయాడు. ఇక పూజా తీరుతో రాధే శ్యామ్ నిర్మాతలు విసిగిపోయారని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ పై ‘రాధేశ్యామ్’టీం స్పందించింది.
ప్రభాస్, పూజా హెగ్డే, మా మధ్య విబేధాలు అన్న వార్తల్లో నిజం లేదని, అంతేకాకుండా పూజా మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, పూజా-ప్రభాస్ల కెమిస్ట్రీ అలరిస్తుందని తెలిపారు. యూరప్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్నరాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా కనిపించనుంది.