శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడు. కళాహి మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్ను యువ హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించారు.
ఇందులో ఓ పాప బల్లపై పడుకొని ఉండటం, చుట్టూ నిల్చొని ఉన్న వ్యక్తులు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘మూడు కాలల నేపథ్యంలో నడిచే కథ ఇది. స్క్రీన్ప్లే ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి హారర్ కాన్సెప్ట్ రాలేదు. టీజర్ను ఈ నెల 30న విడుదల చేస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి, దర్శకత్వం: సాయికిరణ్ దైదా.