Pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమా సక్సెస్తో జోష్ మీదున్నాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటుగా సాయి ధరమ్ తేజ్తో కలిసి ‘వినోదయ సితం’ రీమేక్లో నటించనున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
తమిళ స్టార్ విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘తేరి’. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్రాజు ‘పోలిసోడు’ టైటిల్తో విడుదల చేశాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఈ చిత్రానికి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహించనున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా పోలిసోడు సినిమాను తెలుగులో చాలా వరకు చూసేసారు. అయినా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడంపై సోషల్ మీడియాలో నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదివరకే పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా కూడా తెలుగులో ‘వీరుడోక్కడే’ టైటిల్తో 2014లోనే విడుదలైంది.