ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో భీమ్లా నాయక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్గా రూపొందింది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా, బిజు మీనన్ పోషించిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు.
జనవరి 12, 2022న భీమ్లా నాయక్ చిత్రాన్ని థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉండగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే కొన్ని పోస్టర్లు, ప్రమోషనల్ స్టఫ్ బయటకు రాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన సింగిల్ విడుదల అయింది.. ‘అడవి తల్లి మాట’ అనే టైటిల్తో రూపొందిన ఈ పాట శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంతక ముందు చిత్రం నుండి విడుదలైన సాంగ్స్ కూడా ఆకర్షించాయి.
గత కొద్ది రోజులుగా భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ ఓ పాట పాడాడని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇందులో ఎంత క్లారిటీ ఉందో తెలియక అభిమానులు ఆలోచనలో పడ్డారు. తాజాగా ఓ ఫొటో అభిమానులు ఊహించిన దానికి మరింత బలం చేకూరుస్తుంది. ఫొటోలో కనిపిస్తున్న సెటప్ చూస్తుంటే పవన్ ఏదో సాంగ్ పాడినట్టు గానే అనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు