కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో చిత్రసీమలో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం జూలై నెలలో తిరిగి సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర తెలుగు రీమేక్లో పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రానా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. సాగర్చంద్ర దర్శకుడు. లాక్డౌన్కు ముందు కొంత భాగం చిత్రీకరణ జరిగింది. జూలై 11 నుంచి హైదరాబాద్లో వేస్తున్న భారీ సెట్లో పవన్కల్యాణ్, రానాలపై కీలక ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్స్టేషన్ సెట్ను తీర్చిదిద్దుతున్నారు. పవన్కల్యాణ్, రానా మధ్య పోరాటఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో పవన్కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానాతో జోడీగా ఐశ్వర్యరాజేష్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలందిస్తున్నారు.