ఒకవైపు సినిమాలు,మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు పవన్కళ్యాణ్. ఆయన గత కొద్ది రోజులుగా భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 25 నుంచి పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సెట్లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్లో ఆయనపై పోరాట ఘట్టాలను చిత్రీకరించనున్నారు ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 29న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. సినిమా కంప్లీట్ గా 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని పవన్ పాత్ర కూడా రాబిన్ హుడ్ తరహాలో చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ఆధారంగా చేసుకొని కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు క్రిష్ తెలియజేశాడు.. ఇప్పటివరకు తెలుగులోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు చూడలేదని కూడా ఈ దర్శకుడు నమ్మకంగా తెలియజేశాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.