Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి ఉత్సాహాన్ని కలిగించే అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన “They Call Him OG” చిత్రం మంచి విజయాన్ని నమోదు చేయడంతో, ఇప్పుడు అభిమానుల చూపు పూర్తిగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ “ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)” మీదే ఉంది. ఇంతకు ముందు ఈ చిత్రం 2026 మహాశివరాత్రి సందర్భంగా విడుదలవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో నిర్మాత రవి కిరణ్ ఈ అంశంపై స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. రవి కిరణ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తిచేశారు.
దర్శకుడు హరీష్ శంకర్ రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెడుతున్నారు. షూటింగ్లో ఇంకా 20 నుంచి 25 రోజుల పని మిగిలి ఉంది. ఆ తర్వాత నిర్మాణం పూర్తవుతుంది. ప్రేక్షకులకి అనుకూలంగా ఉండే డేట్ని చూసి మూవీని రిలీజ్ చేస్తామని రవి కిరణ్ అన్నారు.దీంతో సమ్మర్ 2026లో సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అయితే నిర్మాత మాత్రం ఇంకా అధికారిక విడుదల తేదీ నిర్ణయించలేదని చెప్పారు. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
ఈ మూవీకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే మరోసారి మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న నటీమణులు. బ్యూటీతో పాటు పెర్ఫామెన్స్ పరంగా కూడా ఈ చిత్రానికి వారు కీలకంగా మారనున్నారు. తాజాగా విడుదలైన OG మూవీ విజయంతో పవన్ స్టార్డమ్ మరింత పటిష్టంగా మారింది. దీని ప్రభావం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పైన భారీగా కనిపిస్తోంది. పవన్ పాత్ర స్టైల్, పవర్, మాస్ యాంగిల్ అన్నీ కలగలిసిన క్యారెక్టర్గా డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమాతోను పవన్ మరో మంచి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.