AVM Saravanan | ప్రముఖ నిర్మాత, లెజెండరీ ఏవీఎం స్టూడియోస్ అధినేత శ్రీ ఎ.వి.ఎమ్. శరవణన్ (A.V.M. Saravanan) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శరవణన్ మరణవార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏవీఎం (AVM) సంస్థను శ్రీ శరవణన్ గారు సమర్థవంతంగా ముందుకు నడిపారని కొనియాడారు. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా, ఎప్పుడూ వైవిధ్యమైన కథలను, ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూసే విలువలతో కూడిన చిత్రాలను నిర్మించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన మైలురాయి చిత్రాలను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి గారితో నిర్మించిన ‘పున్నమినాగు’ చిత్రం తరాల అంతరం లేకుండా నేటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘లీడర్’, ‘మెరుపు కలలు’, ‘శివాజీ’ (రజనీకాంత్) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు.
శ్రీ ఎ.వి.ఎమ్. శరవణన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.
– @PawanKalyan pic.twitter.com/vsWYegy3v3
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 4, 2025