తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా అకౌంట్స్ను హీరో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వైజే రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, 15 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించడం మంచి విషయం. సమాజంలోని తప్పు ఒప్పులను సరిచేస్తూ బాధ్యతాయుతమైన పాత్రికేయులుగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.