స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పవన్తో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న సినిమా త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలోని నాయిక సహా ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
కథానుసారం ఈ సినిమాను పాటలు, ఫైట్స్ లేకుండా చిత్రీకరిస్తున్నారట. హాలీవుడ్ ఫిల్మ్ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుజీత్..ఆ తర్వాత సినిమా చేయలేదు. వీరి కాంబినేషన్ చిత్రం మీద అంచనాలున్నాయి. ప్రస్తుతం పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన చేతిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాధ్ భగత్సింగ్’, సముద్రఖని దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ ‘వినోదయ సితం’ రీమేక్ ఉన్నాయి. ‘వినోదయ సితం’ రీమేక్లో పవన్తో పాటు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.