చైతన్యరావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మాతలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నింగి నుంచి జారే..’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. రీ స్వరపరచిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. హరిచరణ్, లిప్సిక ఆలపించారు.
ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్, ఫస్ట్లుక్ టీజర్కు మంచి స్పందన లభిస్తున్నదని, వినోదాత్మక చిత్రంగా మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, నిర్మాణ సంస్థ: వనమాలి క్రియేషన్స్, రచన-దర్శకత్వం: సంతోష్ కంభంపాటి.