మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పరశురామ్ పెట్ల..తన తదుపరి సినిమాను హీరో నాగ చైతన్యతో తెరకెక్కిస్తానని తెలిపారు. ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ను కూడా అనుకున్నారు. 14 రీల్స్ సంస్థలో ఈ సినిమా నిర్మించాలని సన్నాహాలు జరిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కాంబో మూవీ తెరకెక్కే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను పక్కనపెట్టినట్లు తెలుస్తున్నది.
పరశురామ్ తన తదుపరి సినిమాను ప్రస్తుతానికి ప్రకటించలేదు. మరోవైపు నాగ చైతన్య ‘కస్టడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పోలీస్ అధికారి శివ పాత్రలో కనిపించనున్నారు. కృతిశెట్టి నాయికగా నటిస్తున్నది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.