Pankaj Tripathi | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై మంచి కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం మార్చి 25న డిస్నీ+హాట్స్టార్ మరియు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రం బృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
కలకత్తా బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఆయితే గత కొన్ని రోజుల నుంచి ‘మిర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా పంకజ్ త్రిపాఠి ఈ వార్తలపై స్పందించాడు. ‘పవన్కళ్యాణ్తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు సంతోషాన్ని కలిగించాయి. అవి నిజం కావాలని కోరుకుంటున్నా. దురదృష్టవశాత్తు అది నిజం కాదు. కానీ నేను ఆయనతో కలిసి ఏదో ఒకరోజు పని చేస్తానని ఆశిస్తున్నాను’ అని పంకజ్ పేర్కొన్నాడు. ‘మిర్జాపూర్’ సిరీస్తో ఈయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.