పాన్ ఇండియా సినిమా ట్రెండ్ గురించి బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్కపూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే ఏ సినిమా అయినా తన దృష్టిలో పాన్ ఇండియా ఫిల్మ్ అని అన్నారు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా ట్రెండ్ క్రమంగా కనుమరుగైపోతుందని చెప్పా రు.
ఆయన కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం ‘షంషేరా’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతి దర్శకుడు తన సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించాలని కోరుకుంటాడు. కథలో సత్తా ఉంటే ఆ సినిమా కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. అప్పుడు ఆ సినిమాను పాన్ వరల్డ్ ఫిల్మ్ అంటారు. కొన్నేళ్ల క్రితం ఏదైనా సినిమా వందకోట్ల వసూళ్లు దాటితే హండ్రెడ్ క్రోర్ మూవీ అంటూ ప్రచారం చేసేవారు. ఇప్పుడా ట్రెండ్ మొత్తం పోయింది. పాన్ ఇండియా మూవీ ట్రెండ్ కూడా త్వరలో కనుమరుగైపోతుంది’ అని రణబీర్కపూర్ పేర్కొన్నారు.