యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రలలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ చిత్రీకరణను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ పార్ట్ కూడా పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంబరాలు చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్ఎక్స్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రం టీజర్, ఇతర ప్రచార కంటెంట్కు సంబంధించిన అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్కి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.