సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రావణ కళ్యాణం’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జేవీ మధుకిరణ్ దర్శకుడు. హాల్సియాన్ మూవీస్, ఎం.ఎఫ్.ఎఫ్ మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యదేవ్ కెమెరా స్విఛాన్ చేయగా, అర్జున్సింహా క్లాప్నిచ్చారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ ‘చాలా కొత్త కథ ఇది.
ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. సీనియర్ నటీనటులు భాగం కావడం పెద్ద బలంగా నిలుస్తుంది’ అని చెప్పారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామని దర్శకుడు పేర్కొన్నారు. సందీప్మాధవ్, రాజేంద్రప్రసాద్, దీపికా, రీతూ గాయత్రి, శత్ర, రాజ్కుమార్, కాసిరెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్, సంగీతం: రాధన్, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్, ఆర్ట్: దేవా, సంభాషణలు: భవానీ ప్రసాద్, రచన-దర్శకత్వం: జేవీ మధు కిరణ్.