Paarijatha Parvam | ‘కీడా కోలా’, ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పారిజాత పర్వం’. మాళవిక సతీశన్ కథనాయికగా నటిస్తుండగా.. సునీల్, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్తో పాటు టీజర్ వీడియో విడుదల చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేసింది.
కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్తోనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. ఇక యాక్షన్, డ్రామా, ఫన్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్తో ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులని అలరిస్తోంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తుండగా.. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.