P.S. Mithran Marriage | కోలీవుడ్లో మరో జంట పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైంది. ‘అభిమన్యుడు’, ‘హీరో’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో కోలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పి.ఎస్ మిత్రన్. కాగా ఈయన కోలీవుడ్ ఫిలిం జర్నలిస్ట్ ఆశామీరా అయ్యప్పన్తో ప్రేమలో పడ్డాడు. తాజాగా వీరువురు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈయన తన సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యాడో వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయ్యాడు. అభిమన్యుడు సీక్వెల్ విషయంలో విశాల్కు ఈయనకు మధ్య వివాదాలు తలెత్తాయి.
ప్రస్తుతం మిత్రన్, కార్తితో ‘సర్దార్’ చిత్రాన్ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దిపావళి కానుకగా అక్టోబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కార్తి డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. చంకీపాండే, లైలా, రజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.