OTT | ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్తో పాటు ఓటీటీలో పలు చిత్రాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. గత వారం వార్ 2, కూలీ చిత్రాలతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోగా, ఈ వారం మాత్రం అంత హంగామా లేదనే చెప్పాలి.అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’, ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ వంటి చిత్రాలు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు,వెబ్సిరీస్లేంటో చూద్దాం.
నెట్ఫ్లిక్స్ లో చూస్తే..
రివర్స్ ఆఫ్ ఫేట్ (వెబ్సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
హోస్టేజ్ (వెబ్సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
మా (హిందీ మూవీ) ఆగస్టు 22 నుండి స్ట్రీమ్ కానుంది
ది కిల్లర్ (మూవీ) ఆగస్టు 24 నుండి స్ట్రీమ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్లో చూస్తే..
రోడ్ఆన్ ఏ మిలియన్ సీజన్2 (వెబ్సిరీస్) ఆగస్టు 22 నుండి స్ట్రీమ్ కానుంది
జియో హాట్స్టార్ లో..
పీస్ మేకర్సీజన్2 (వెబ్సిరీస్) ఆగస్టు 21 నుండి స్ట్రీమ్ అవుతుంది
యాపిల్ టీవీలో
ఇన్వేషన్: సీజన్3 (వెబ్సిరీస్) ఆగస్టు 22 నుండి స్ట్రీమ్ కానుంది.
.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. క్లైమాక్స్ సహా కొన్ని సన్నివేశాల్లో పలు మార్పులు చేసి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. మరోవైపు మలయాళ సినిమా సూత్రవాక్యం ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది. తెలుగులో విడుదల చేసే ప్రయత్నం చేశారు కాని అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఆగస్టు 22 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికపై మారీశన్ అనే చిత్రం కూడా విడుదల కానుంది.ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం సుదీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది. ఇక విజయ్ సేతుపతి,నిత్యా మీనన్ నటించిన చిత్రం’తలైవా తలైవి’తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో విడుదల కాగా, ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఆగస్టు 22 నుండి స్ట్రీమ్ చేయబోతున్నారు.మరోవైపు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు అనే కామెడీ డ్రామా మూవీ ఆగస్టు 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా, దీనిని ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉన్న వారు ఇప్పటి నుండే వీక్షించే ఛాన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు.ఈ చిత్రంతో మనోజ్ చంద్ర,మౌనిక తదితరులు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.