న్యూఢిల్లీ: ఆస్కార్స్ సీజన్ మొదలైంది. ఈ ఏడాది జరిగే ఆ వేడుక కోసం ఇప్పటికే అకాడమీ ఓ జాబితాను ప్రకటించింది. ఈ యేటి ఆస్కార్స్ రిమైండర్ రేసులో ఉన్న 301 చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. దాంట్లో ఇండియన్ చిత్రాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడి, ద కశ్మీర్ ఫైల్స్, కాంతారా చిత్రాలు కూడా ఆస్కార్స్ లిస్టులో ఉన్నట్లు అకాడమీ వెల్లడించింది. ఈ జాబితాలో చెల్లో షో, మీ వసంతరావ్, తుజియా సాతి కహి హి, రాకెట్రీ, విక్రాంత్ రోణా లాంటి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి.
డాక్యుమెంటరీ జాబితాలో ఆల్ దట్ బ్రీత్స్, ద ఎలిఫెంట్ విష్పర్స్ లాంటి ఫిల్మ్స్ ఉన్నాయి. అకాడమీ అవార్డులకు తుది నామినేషన్లను మాత్రం జనవరి 24వ తేదీన ప్రకటించనున్నారు. రిమైండర్ లిస్టులో ఉన్న చిత్రాలు ఆస్కార్స్లో వివిధ కేటగిరీలకు పోటీపడే ఛాన్సు ఉంటుంది. కానీ తుది నామినేషన్లలకు ఆ చిత్రాలు ఎంపిక అవుతాయో లేదో గ్యారెంటీ ఉండదు.