Om Bheem Bush | టాలీవుడ్ యువ నటులు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్(No Logic Only Magic) అనేది ఉపశీర్షిక. రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు ‘హుషార్’ (Husharu) ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి ఇంకా తొమ్మిది రోజులే ఉండటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ను మార్చి 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక బ్రోచేవారెవరురా తర్వాత (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) కాంబో రిపీట్ అవుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వి.సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. యు.వి.క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది.
ᴰₑₛᵢ ᴳₕₒₛₜᵦᵤₛₜₑᵣₛ ₐᵣₑ ᵣₑₐᴰʸ ₜₒ ₛₜᵣᵢₖₑ 🔮👻#OmBheemBush trailer on 𝟭𝟱𝙩𝙝 𝙈𝙖𝙧𝙘𝙝 at 𝟰:𝟱𝟵 𝙋𝙈 ❤🔥
Grand release worldwide on March 22nd.
Directed by @HarshaKonuganti@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshaakhan… pic.twitter.com/a8W9etW67o
— BA Raju’s Team (@baraju_SuperHit) March 13, 2024