పవన్కల్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. కొద్ది మాసాల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. పవన్కల్యాణ్ ైస్టెలిష్ లుక్స్తో కనిపించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంబయి, జపాన్ నేపథ్యంలో నడిచే గ్యాంగ్స్టర్ కథాంశమిదని, పవన్కల్యాణ్ ఇప్పటివరకు ఈ తరహా రోల్లో కనిపించలేదని అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని తెలిసింది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.