సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ తెలుగులో హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకుడు. జె. మల్లికార్జున నిర్మాత. ఇటీవల ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలుగు, కన్నడంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అన్నారు. భారీ యాక్షన్ హంగులతో రూపొందించిన చిత్రమిదని, తన పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని హీరో ప్రణం దేవరాజ్ తెలిపారు.
నిర్మాత జె.మల్లికార్జున మాట్లాడుతూ ‘యాక్షన్, ఎమోషన్ సమపాళ్లలో మేళవించిన కథాంశమిది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. విన్ను మద్దిపాటి, గరుడ రామ్, కాశీ విశ్వనాథ్, శత్రు, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్, సంగీతం: మహతి స్వరసాగర్, దర్శకత్వం: సాయి శివన్ జంపాన.