తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ,నటి నుస్రత్ జహాన్ గురువారం ఆగస్టు 26 మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కోల్కతాలోని నియోషియా ఆస్పత్రిలో ఆమెకు ప్రసవం జరిగగా, ఆస్పత్రిలో నుస్రత్ జహాన్ వెంట బెంగాల్ నటుడు యశ్ దాస్ గుప్తా ఉన్నారు. అయితే నుస్రత్ జహాన్ బిడ్డకు జన్మనివ్వడంపై ఆమె మాజీ భర్త నిఖిల్ జైన్ సోషల్ మీడియాలో స్పందించారు. మా మధ్య బేధాభిప్రాయాలు ఉండొచ్చు. అయినప్పటికీ,తల్లి అయిన ఆమెకు,బిడ్డకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
ఇక ఇటీవల కోల్కతా లో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్ దాస్ గుప్తా పేరును చేర్చింది. దీంతో ఆ బిడ్డకు తండ్రి యష్ అని నిరూపితం అయింది.
ఎస్ఓఎస్ కోల్కతా సినిమా షూటింగ్ టైమ్లో నుస్రత్, యష్ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఇరువురు డేటింగ్లో ఉన్నారు. యష్ గతంలో శ్వేత సింగ్ని పెళ్లి చేసుకోగా, వారికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని సమాచారం. ఇక జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలో పెళ్లి చేసుకున్నారు.విభేదాల కారణంగా 2020 నుండి దూరంగా ఉంటున్నారు.