N.T.R | జూనియర్ ఎన్టీఆర్ థియేటర్లలో కనిపించి మూడేళ్లు దాటింది. అప్పుడెప్పుడో వచ్చిన అరవింద సమేత తర్వాత ఇప్పటివరకు నటించిన సినిమా రాలేదు. తన ఫోకస్ మొత్తం ట్రిపుల్ ఆర్ సినిమాపైనే పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ అయింది. కరోనా విపత్కర పరిస్థితులను దాటుకుని తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇన్నేండ్లు వచ్చిన గ్యాప్ను ఫిల్ చేయాలని ఫిక్సయ్యాడు తారక్. అందుకే వరుసపెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా త్వరలోనే మొదలవుతుండగా.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. వీటితో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లను ఎన్టీఆర్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లి, లోకేశ్ కనకరాజ్, వెట్రిమారన్, సంజయ్ లీలా భన్సాలీ, సుకుమార్ వీళ్లతో పాటుగా దర్శక ధీరుడు రాజమౌళితో ఐదో సినిమాను కూడా చేయనున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన అధికారప్రకటనలు మాత్రం రావాల్సిఉంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది. రామ్ చరణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. డి.వి.వి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్నినిర్మించాడు. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా మార్చి25 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.