NTR | టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్లో “వార్ 2తో సందడి చేశారు. ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, అభిమానులని కొంత నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుననాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతోంది. అయితే ఈసారి కారణం సినిమా కాదు… ఒక అద్భుతమైన స్కెచ్ ఆర్ట్!
తెలుగు అమ్మాయి బ్యులా రూబీ పెన్సిల్ ఆర్ట్ లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందుతోంది. సినిమా సెలబ్రిటీలు, స్టార్ హీరోల చిత్రాలను స్కెచ్ రూపంలో తీర్చిదిద్ది వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మకానికి ఉంచుతుంది. తాజాగా ఆమె గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ స్కెచ్ను చూసిన ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి బ్యులా రూబీకి మెసేజ్ చేసి, తాను ఆ ఆర్ట్ను కొనాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బ్యులా రూబీ తెలిపిన వివరాల ప్రకారం, “ఇది నేను గీసిన తెలుగు హీరోల పెన్సిల్ స్కెచ్లలో అత్యధిక ధరకు అమ్ముడైనది. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్లో నన్ను సంప్రదించి, దీన్ని 1650 డాలర్లకు అంటే సుమారుగా రూ. 1.45 లక్షలకు కొనుగోలు చేశాడు.
ఇది నేను ఊహించలేదు. నా ఆర్ట్ ఇంత విలువ పొందుతుందని నాకు తెలియదు అని చెప్పారు. ఈ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎన్టీఆర్ అభిమానులు బ్యులా రూబీ ఆర్ట్ను ప్రశంసిస్తున్నారు. “స్కెచ్ అదిరింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్కెచ్ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.