యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్(RRR) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్(NTR) .. ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని కూడా సక్సెస్ ఫుల్గా నడిపించారు.రీసెంట్గా ఈ సీజన్ పూర్తి కావడంతో త్వరలో కొరటాల శివ తో చేయాల్సిన ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.
డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఈ సినిమా మొదలు కావడానికి నెల రోజులు సమయం ఉండడం, కమిట్ అయిన ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావడంతో కొద్ది రోజులు విహారయాత్రకు వెళ్లనున్నారట. ఇక ఇదిలా ఉంటే చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించిన ఎన్టీఆర్.. రానున్న రోజులలో వరుస సినిమాలతో అలరించనున్నాడు.
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు.కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని సంప్రదించారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, సుకుమార్ వంటి దర్శకులతో కలిసి పని చేయనున్నట్టు టాక్.