కొంతకాలంగా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నాయి. భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టేందుకు కూడా రెడీ అంటున్నాయి. పాపులర్ డిజిటల్ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ (Netflix) ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన గాడ్ఫాదర్, వాల్తేరు వీరయ్య డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.
దీంతోపాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భోళా శంకర్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. కాగా నెట్ఫ్లిక్స్ కన్ను ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాపై పడిందని, భారీ మొత్తానికి ఆ స్టార్ హీరో సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిందని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో నెట్ఫ్లిక్స్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా ఎస్ఎస్ఎంబీ 28 స్ట్రీమింగ్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టిందన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 రైట్స్ పై కూడా నెట్ఫ్లిక్స్ ఫోకస్ పెట్టిందట.
ఇండియాలో నెట్ఫ్లిక్స్ (మొబైల్ యూజర్స్) క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. యూజర్స్అంతకంతకూ పెరిగిపోతుందడటంతో ఈ ఓటీటీ ప్లాట్ఫాం తెలుగు సినిమాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. మరి రాబోయే కాలంలో నెట్ఫ్లిక్స్ ఇంకా ఎన్ని భారీ సినిమాలను లైన్లో పెడుతుందోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.