Mythri Movie Makers | యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో రెండు రోజుల్లో తన పుట్టినరోజు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్.. అతడి సినిమాల అప్డేట్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తారక్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం వార్ 2 నుంచి బర్త్డే నాడు స్పెషల్ అప్డేట్ ఉండబోతుందని అటు హృతిక్ రోషన్తో పాటు ఇటు చిత్రనిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ ఇప్పటికే ప్రకటించాయి. అయితే వార్ 2తో పాటు తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ అనే సినిమాకు సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ తారక్ బర్త్డే నాడు డ్రాగన్ నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించింది.
“ఇది పూర్తిగా ‘వార్ 2’ సమయం.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని (WAR 2) సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకోండి” అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా ఈ సమయంలో ఉండదని స్పష్టం చేసింది. ‘వార్ 2’ విడుదల సమయంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ సినిమాకు సంబంధించిన మాస్ అప్డేట్ను సరైన సమయం వచ్చినప్పుడు అందిస్తామని పరోక్షంగా తెలిపింది.
కాగా, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఏదైనా ప్రత్యేకమైన ప్రకటన వస్తుందని ఆశించారు. అయితే, నిర్మాణ సంస్థ తాజా పోస్ట్తో ఆ ఆశలు నెరవేరనట్టే కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
Respecting the WAR…
Before unleashing the CARNAGE 🌋For now, #WAR2 takes over the proceedings.
We’ll arrive next at the perfect time to launch our MASS MISSILE – #NTRNeel Glimpse 💥💥💥Celebrate Man of Masses @Tarak9999’s birthday with #War2.#PrashanthNeel @MythriOfficial…
— Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2025