Actress Nithya Menen | హీరోయిన్ నిత్యామీనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తనకెంతో ఇష్టమైన వాళ్ల అమ్మమ్మ తుది శ్వాస విడిచింది. ఈ విషాద ఘటనను నిత్యామీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయింది. తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి ఉన్న ఫొటోను నిత్యామీనన్ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. మరో లోకంలో కలుద్దాం’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. దీనిపై పలువురు అభిమానులు నిత్యామీనన్ను ధైర్యంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.
పుష్కర కాలం క్రితం వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. భీమ్లానాయక్, తిరు సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్లోకి వచ్చేసింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి.