Nikhil Siddarth Sensational Comments | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను స్టార్ చేశారు. తాజాగా నిఖిల్ ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో నిఖిల్ మాట్లాడుతూ జూలై 22నుండి మా సినిమాను పోస్ట్పోన్ చేయించారు. సరే అని పోస్పోన్ చేసి నెక్స్ట్ పాజిబుల్ డేట్ ఆగస్టు 12ను పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తే థియేటర్స్ దొరకవు. అక్టోబర్లో చేసుకోండి అన్నారు. ఇక అప్పుడే జీవితంలో మొదటి సారి ఏడ్చాను. నా లాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా హిట్టయితే 3వ పార్టు, 4వ పార్టు ఇలా తీస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.